07-06-2025 03:21:40 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులతో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అలాయి బలాయి తీసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ మాట్లాడుతూ... భారత దేశంలో ముస్లింలు, హిందువులు కలిసి పండుగలు నిర్వహించుకుంటారని ఇది మతసామరస్యానికి ప్రతీక, త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.