31-05-2025 08:56:58 PM
పాలమూరులో క్రికెట్ ఆడి సందడి చేసిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజీ గ్రౌండ్ లో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఈ అయ్యప్ప ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ పాల్గొని బ్యాట్ క్రికెట్ ఆడారు. కాసేపు క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... 32 టీమ్ ల మధ్య గత 4 రోజులుగా కొనసాగుతున్న పోటీలు కొనసాగించడం గొప్ప విషయం అన్నారు.
గ్రామీన ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఈ పోటీలు నిర్వహిచడం శుభపరిణామని తెలియజేశారు. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, అయ్యప్ప భక్తుల అసోసియేషన్ అభివృద్ధికి నావంతు కృషి చేస్తానన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను స్పోర్టివ్ గా తీసుకోవాలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు ఉన్నారు.