calender_icon.png 2 June, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం రికార్డులను సక్రమంగా నిర్వహించాలి..

31-05-2025 08:17:49 PM

అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి..

ఖమ్మం (విజయక్రాంతి): రేషన్ బియ్యం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి(Additional Collector P. Srinivasa Reddy) అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ మండలాల ఎం.ఎల్.ఎస్. పాయింట్ల ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎం.ఎల్.ఎస్. పాయింట్ల నుంచి రేషన్ షాపులకు, విద్యా సంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు, గురుకులాలకు సకాలంలో బియ్యం సరఫరా పూర్తి చేయాలన్నారు. రేషన్ బియ్యం రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.