29 April, 2026 | 8:54 PM

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

29-04-2026 07:49 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): వేసవికాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కురుమల సత్యనారాయణ ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు.

కుడుముల సత్యనారాయణను అభినందించిన ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వేసవి కాలంలో అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం గత 26 సంవత్సరాలుగా మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు.

ప్రజల దాహార్తిని తీర్చడంలో, ఆరోగ్యాన్ని కాపాడడంలో అంబలి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, నాయకులు కురుమ సాయిబాబా, తిరుపతి, గఫ్ఫార్, సామెల్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.