18-06-2025 12:00:00 AM
కోదాడ జూన్ 17 : నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యం అని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు అన్నా రు. మంగళవారం పట్టణం లోని శకుంతల థియేటర్ సెంటర్ లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జ న్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలే కుటుంబంగా చూసుకుంటున్న నాయకురాలు ఉత్తం పద్మావతి అన్నారు.
పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్, మాజీ కౌ న్సిలర్లు పెండం వెంకటేశ్వర్లు, కాజా, మైనుదీన్, రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్, ఆవు ల రామారావు, కారింగుల అంజన్ గౌడ్, గంధం పాండు, సుధాకర్, సయ్యద్ బాబాపాల్గొన్నారు.