18-06-2025 12:00:00 AM
-హాజరైన సినీ నటుడు అడివి శేష్
-శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్గా చెస్ ఛాంపియన్ గుకేష్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీజేఈఈ (మెయిన్, అడ్వాన్స్డ్), నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి తన అగ్రస్థానాన్ని నిరూపించుకుని, ఆలిండియా నంబర్ వన్గా నిలిచింది. ఈ సందర్భంగా ఛాంపియన్స్ వేడుకను హైటెక్ సిటీ శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య టాపర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమంగా సాధకులను సత్కరించే వేదికగా ‘ఐరావత్‘ నిలిచింది.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు, ప్రముఖ నటుడు అడివి శేష్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా శ్రీచైతన్య డైరెక్టర్లు శ్రీధర్ యలమంచిలి, సుష్మా బొప్పున, సీమ చొప్పున పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక సన్మానాలు చేశారు. ‘చదరంగం మాదిరిగానే, పోటీ పరీక్షల్లో విజయానికి వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, మానసిక స్థైర్యం ఎంతో అవసరం అని గణేష్ దొమ్మరాజు అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ.. ‘2025 జేఈఈ, నీట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన శ్రీచైతన్య విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్ రంగాల్లో దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలు ఓ మార్గదర్శక శక్తిగా విలుస్తున్నాయని ప్రశంసించారు. విద్యాసంస్థల అకడమిక్ డైరక్టర్ సుష్మ చొప్పున మాట్లాడుతూ.. భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ బొమ్మరాజును బ్రాండ్ అంబాసిడర్గా నియమించినందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు.
గుకేష్ సామర్థ్యాలు, సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటానికి అవసరమైన నైపుణ్యాలతో పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడంలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయి. శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమా చొప్పున మాట్లాడుతూ..- ‘గుకేష్ బొమ్మరాజు శ్రీచైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించటం గర్వకారణం. గుకేష్ ప్రేరణతో విద్యార్థులు మరింత దృఢంగా ముందుకు సాగుతారని నమ్ముతున్నాం” అని తెలిపారు.