28-06-2025 08:06:47 PM
కుభీర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 85 కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయా గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మి పథకంలో ఇచ్చే లక్ష రూపాయలకు అదనంగా తులం బంగారం ఇచ్చి తీరుతామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటను నిలుపుకోవడంలో విఫలమయ్యారన్నారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు నగదు తో పాటు తులం బంగారం అందజేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మండలంలోని కుప్టి, పార్డి (కె) గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్న లబ్ధిదారులకు నిర్మాణాలకు అనుగుణంగా డబ్బులను వెంటవెంటనే అందజేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం హల్దా గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలువురు బాధ్యత కుటుంబాలను ఆయన పరామర్శించారు.