calender_icon.png 15 June, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.25 లక్షల అంచనాతో పలు నూతన ట్రాన్స్ఫార్ల ఏర్పాటు

16-05-2025 10:13:58 PM

లో వోల్టేజ్  విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే పాయం

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో లో వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు రూ 25 లక్షలతో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పద్మశాలి భవన్, మణుగూరు డిఎస్పీ ఆఫీస్ ఎదురుగా, అంబేద్కర్ సెంటర్, భగత్ సింగ్ నగర్ లో,  లో వోల్టేజ్ విద్యుత్ వస్తున్న కారణంగా ప్రజలు విద్యుత్ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మణుగూరులో 4 నూతన విద్యుత్ ట్రాన్స్ఫారాలకు శ్రీకారం చుట్టా మాన్నారు. ఈ  కార్యక్రమంలో డిఈ జీవన్ కుమార్,  ఏఈ ఉమారావు, ఎంపీడీవో శ్రీనివాస్ రావు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షులు సౌజన్య,, మణుగూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు