18-01-2026 02:55:26 PM
భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన ఆడే మహేష్ కుమారుడు ఆకాష్ నేవీలో ఉద్యోగం పొందడంతో ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆ యువకుల్ని అభినందించారు. దేశ సేవ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి గ్రామ నాయకులు శివకుమార్ శరత్ కుమార్ ప్రభాకర్ లింగం తదితరులు ఉన్నారు.