calender_icon.png 13 June, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాదిగూడ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

12-06-2025 09:04:01 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గం(Asifabad Constituency)లోని గాది గుడా మండలం పిప్పిరి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం పిడుగుపాటుతో ఆరుగురు రైతులు మృతి చెందడంతో పాటు పలువురికి తీవ్రగాయాలు అయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Lakshmi) తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాదులోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని సంఘటన స్థలానికి రాలేక పోతున్నానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా రిమ్స్ సూపరింటెండెంట్ ను కోరారు. ఈ సంఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.