22 April, 2026 | 2:59 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

గాదిగూడ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

12-06-2025 09:04 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గం(Asifabad Constituency)లోని గాది గుడా మండలం పిప్పిరి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం పిడుగుపాటుతో ఆరుగురు రైతులు మృతి చెందడంతో పాటు పలువురికి తీవ్రగాయాలు అయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Lakshmi) తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాదులోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని సంఘటన స్థలానికి రాలేక పోతున్నానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా రిమ్స్ సూపరింటెండెంట్ ను కోరారు. ఈ సంఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.