29 July, 2026 | 9:13 PM

Breaking News

రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •   చిట్యాలలో సర్ -2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం   •  

మహా శివరాత్రి సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు

15-02-2026 06:28 PM

- తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శనాలు

సనత్‌నగర్,(విజయక్రాంతి): పరమశివుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమీర్ పేటలో...

అమీర్ పేట డివిజన్ లోని హనుమాన్ టెంపుల్, గురుమూర్తి నగర్ లోని శ్రీ వినాయక టెంపుల్ లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దరహించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వినాయక టెంపుల్ లో శివలింగానికి పాలతో అభిషేకం చేసి పూజలు జరిపారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఈఓలు జయంతి, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, ప్రకాష్ గౌడ్, కట్టా బలరాం, శివ, సత్యనారాయణ యాదవ్, ఉత్తమ్ సింగ్ తదితరులు ఉన్నారు.

సనత్ నగర్ లో...

మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్ లో గల శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన ను ఆలయ పండితులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, ప్రదీప్ గౌడ్, ఖలీల్, అర్జున్ గౌడ్, జమీర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.