29 July, 2026 | 10:00 PM

Breaking News

గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •  

పొంగిన రెంకోనె వాగు... రాకపోకలు బంద్

29-07-2026 09:09 PM

మైనార్టీ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అవస్థలు.

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రెంకోనే వాగు ఉప్పొంగి తాత్కాలిక వంతెన తెగిపోవడంతో రాకపోకులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలో పట్టణ శివారున ప్రవహిస్తున్న రెంకోనే వాగు ఉప్పొంగింది. వాగు అవతల హైటెక్ సిటీ కాలనీ ఉండడం, అక్కడే మైనారిటీ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్థానికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దశాబ్దాల నుంచి ఈ సమస్య తీరకుండా ఉండడంతో ప్రతి వర్షాకాలం ఈ తిప్పలు తప్పడం లేదు. ప్రతి ఏడూ వాగుపై తాత్కాలిక వంతెన నిర్మించడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. కాగా వాగు పై  వంతెన నిర్మించాలని అనేకసార్లు మున్సిపాలిటీకి విన్నవించిన ఈ సమస్య తీరడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలకు ఈ వాగు ఉప్పొంగడంతో పాఠశాల ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసులు సైతం ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఇకనైనా అధికారులు ,నాయకులు పట్టించుకుని వంతెన నిర్మించి సమస్య తీర్చాలని పలువురు వేడుకుంటున్నారు.