01-11-2025 06:49:00 PM
సనత్నగర్,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి నామ స్మరణ ఎంతో మధురమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట లోని ప్రకాష్ నగర్ లో గల భూ లక్ష్మమ్మ ఆలయం నుండి శబరిమల వరకు సాగే అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ప్రారంభించారు. ముందుగా భూ లక్ష్మమ్మ, సాయిబాబా ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ప్రారంభించారు.