17 March, 2026 | 2:48 AM

వేం నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

17-03-2026 01:47 AM

నిజాంసాగర్ మార్చి 16 (విజయ క్రాంతి )నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌లు సోమవారం రోజు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందించి రాష్ట్ర అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని వారు కోరారు.