calender_icon.png 27 October, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణారావు

27-10-2025 01:09:57 AM

పెద్దపల్లి, అక్టోబర్ 26(విజయ క్రాంతి) పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలోని శ్రీరామ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్య మాట్లాడుతూ... రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని, 8 శాతం తేమతో ఉన్న పత్తిని 8110/- రూపాయలు పత్తి పంటకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎప్పుడు రైతుల మేలు కోరుతుందని, పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు రైతులు ఏ పంట పెట్టిన ఆ పంటకు ప్రభుత్వం మద్దతు ఇచ్చి రైతులను పంట నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 24 గంటలు రైతులకు కరెంటు ఇచ్చిందని,  వ్యవసాయం చేయడంలో రైతును మించిన అనుభవజ్ఞుడు ఎవరు లేరి అన్నారు.

త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించి, గింజ కటింగ్ లేకుండా వారి ధాన్యం కొనడం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి, స్వయాన రైతు అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతినిత్యం రైతుల కోసమే ఆలోచన చేస్తున్నారని, నియోజకవర్గంలో గత పాలకులు రైతుల దగ్గర క్వింటాలు వడ్లకు 10 కిలోల పైన తరుగు పెట్టీ వారి నడ్డివిరిచారని, మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఎలాంటి తరుగు లేకుండా చేసి రైతన్నలకు మేలు చేశామని, ప్రజలకు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు స్వరూప, ప్రకాష్ రావు, శ్రీరామ జిన్నింగ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు రైతులు తదితరులు పాల్గొన్నారు.