13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే

16-02-2026 01:09 AM

అలంపూర్, ఫిబ్రవరి 15: ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు ఆదివారం దర్శించుకున్నారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ఉభయ ఆలయాలను దర్శించుకుని స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు,అర్చకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే కు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే .. ప్రజలకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో భక్తి భావంతో మెలగాలని ఆకాంక్షించారు.వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.ఆయన వెంట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పుల్లూరు నాగేశ్వర్ రెడ్డి ,తదితరులు ఉన్నారు.