13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

దశాబ్దాల డిమాండ్‌ను బీఆర్‌ఎస్ నెరవేర్చింది

16-02-2026 01:10 AM

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి 

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి

రాజాపూర్, ఫిబ్రవరి 15: దశాబ్దాల నుంచి గిరిజన తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందని పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన బంజారాల ఆరాధ్య దైవం,గిరిజనుల ఆధ్యాత్మిక మార్గదర్శి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రమంతటా అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

గిరిజనులలో రాజకీయంగా ఎంతో చైతన్యం వచ్చిందని,గిరిజన సోదరసోదరీమణులు సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు మెంబర్ లుగా పాలన చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ లు పెంచుకోవడం జరిగిందని,గిరిజనుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినమ్మన్నారు. మిషన్ భగీరథతో మహిళల తాగునీటి కష్టాలు తీర్చామని,సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణంకు స్థలాలు కేటాయించుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు తదితరులు ఉన్నారు.