12 March, 2026 | 10:49 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

చికిత్స పొందుతున్న బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

08-01-2026 05:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్న నిర్మల్ జిల్లా చెందిన పలువురిని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలం జాం గ్రామానికి చెందిన మలుకుల భోజన్నతో పాటు కౌట్ల (బి) గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ లను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. పరామర్శించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జాం గ్రామ సర్పంచ్ విలాస్ తో పాటు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.