04-06-2025 10:44:29 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ ముత్తే సత్తయ్య కుమారుడు ముత్తే రాజ్ కుమార్ వివాహానికి ముందస్తుగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి(MLA Gaddam Vivek Venkataswamy) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తిమ్మాపూర్ గ్రామంలోని వరుని స్వగృహానికి విచ్చేసి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. నేడు జరుగబోయే వివాహానికి తాను అందుబాటులో ఉండలేకపోతున్నందుకు ముందుగానే ముత్తే సత్తయ్య కుటుంబానికి వివాహ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం పలువురు అభిమానులతో ఫోటోలు దిగి ఉత్సహాపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంట నాయకులు ప్రతాప్, లక్ష్మీ నారాయణ,కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.