calender_icon.png 3 June, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

01-06-2025 04:51:42 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ కోసం జారీ చేసిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో వర్షాకాలం పనుల టెండర్లలో సిబ్బంది గోల్ మాల్ చేస్తున్నారని,  కొందరు అధికారులు అనుకూలంగా ఉండే  కంపెనీలకు లబ్ది చేకురుస్తున్నారని ఆమె ఆరోపించారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు టెండర్ నిబంధనలను తారుమారు చేసి ఒక విదేశీ కంపెనీకి, ఇద్దరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చారని, దీని ఫలితంగా ప్రభుత్వ నిధులపై అదనంగా రూ.5.85 కోట్ల భారం పడుతోందని కవిత ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 150 మందికి పైగా స్థానిక కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిన టెండర్ వ్యవస్థను ప్రస్తుతం తొమ్మిది జోన్ల వారీగా టెండర్ విధానంతో భర్తీ చేశారు. దీంతో తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యవహారిస్తున్నారని కవిత ఎత్తి చూపారు.

హైదరాబాద్ లో విదేశీ సంస్థ వాహనాలే వాడేలా నిబంధనలు రూపొందించాడంతో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఉద్దేశపూర్వకంగా స్థానిక భాగస్వామ్యాన్ని మినహాయించారని ఎమ్మెల్సీ కవిత నిందించారు. షోరూమ్ యాజమాన్యాలు తెలంగాణ కాంట్రాక్టర్లతో భాగస్వామ్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, కర్ణాటక డీలర్లతో తక్కువ వ్యవధిలో ఒప్పందాలు కుదుర్చుకున్న కాంట్రాక్టర్ల నుండి అవగాహన ఒప్పందాల భౌతిక కాపీలను డిమాండ్ చేయడంతో అధికారులు మరిన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు.

మునుపటి వాహన నమూనాలు 2-3 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ ను రవాణా చేయగలవని, కొత్తగా పేర్కొన్నవి ఒక క్యూబిక్ మీటర్ ను కూడా నిర్వహించలేవని కవిత అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రక్రియ అసాధ్యమని, పక్షపాతమన్నారు. టెండర్లను రద్దు చేసి, ప్రజా నిధులను, స్థానిక ఉపాధిని కాపాడటానికి వార్డుల వారీగా వ్యవస్థను పునరుద్ధరించాలని మున్సిపల్ పరిపాలన మంత్రి, సీఎం రేవంత్ ని ఎమ్మెల్సీ కవిత కోరారు.