17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలి: ఎమ్మెల్సీ కవిత

16-12-2024 01:36 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు వారం రోజుల తర్వాత సోమవారం నాడు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పట్టుపరిశ్రమను ప్రోత్సహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని తెలిపారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. సెరికల్చర్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, బెంగళూరు నుంచి పట్టు దిగుమతి చేసి చేనేతలకు అదనపు భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తక్షణమే పట్టుగూళ్ల బకాయిలు రూ.8 కోట్లు విడుదల చేయాలని కవిత పేర్కొన్నారు.