కాంగ్రెస్‌కు ఎమ్మార్పీఎస్ మద్దతు

29-04-2024 01:15:56 AM

యాదాద్రిభువనగిరి, ఏప్రిల్ 28(విజయ క్రాంతి) : కాంగ్రెస్‌కు ఎమ్మార్పీఎస్ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిగ లను అణచివేసిందని, మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం, దళితబంధు పేర్ల మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. అనంతరం చామల కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మాదిగ జాతికి, వారి సంక్షేమం, వారి అభివృద్ధి, రాజకీయ అవకాశాల కోసం నేను వారి పక్షాన ముందుండి పోరాటం చేస్తానని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్, జనగామ జిల్లా ఇన్‌ఛార్జి కన్నారం పరశురాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంఘపాక ఏసోజు, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి నల్ల నర్సింగ్‌రావు, రాష్ట్ర నాయకులు నాగరాజు, బూసి మహేష్, బొట్ల శ్రీను, స్వామి, సురేశ్, గంగారం రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.