హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : వీఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో దివంగత నాయిని నర్సింహారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు వీఎస్టీ సమీపంలోని సరోజినీ క్రికెట్ అకాడమీలో ఆదివారం జరిగాయి. పోటీల్లో వీఎస్టీ కంపెనీ తరుపున నాలుగు జట్లు పాల్గొన్నా యి. ఈ పోటీలో మూడో షిఫ్ట్ టీం విజేతగా గెలుపొందింది. కామన్ షిఫ్ట్ సభ్యుల టీం రన్నర్గా నిలిచారు. పోటీల్లో గెలుపొందిన వారికి యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మెమోంటోలను అందజేశారు. కార్యక్రమం లో యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రభాక ర్, బాబి, నరేందర్గౌడ్, రవియాదవ్, రణధీర్రెడ్డి, రాములు, అతిక్, శంకర్, మధు, సత్య నారాయణ పాల్గొన్నారు.