రిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీయే

29-04-2024 01:15:27 AM

l బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సామాజిక వివక్ష, సాంఘిక అసమానతలు రూపుమాపడానికి భారత రాజ్యంగం రిజర్వేషన్లు కల్పిస్తే, వాటిని నీరు కార్చడానికి బీజేపీ ప్రభుత్వం అగ్రకుల రిజర్వేషన్లను తీసుకొచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూల సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని నీరుగార్చిందే బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొనలేదని ఆయన తెలిపారు. భవిష్యత్తులో సామాజిక రిజర్వేషన్లు ఎత్తివేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆర్థిక వెనుకబాటు పేరుతో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టికొట్టిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.