27-05-2025 12:14:10 AM
35 ఫోన్ల అందజేత, ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి
మెదక్, మే 26(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి మెదక్ టౌన్లో గత కొన్ని రోజుల నుండి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 35 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని వివరించారు.
ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్ గౌడ్, మెదక్ టౌన్ పోర్టల్ బాద్యతాధికారి మౌనికను జిల్లా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీఎస్.మహేందర్, మెదక్ టౌన్ సీఐ నాగరాజు, మెదక్ టౌన్ ఎసై అమర్ పాల్గొన్నారు.