13 May, 2026 | 12:56 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

అగ్నిమాపక భద్రతపై మాక్ డ్రిల్

30-07-2025 01:11 AM

 శంకర్ పల్లి, జులై 29: డైరెక్టరేట్ జనరల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సూచనల మేరకు, సీఐఎస్ ఎఫ్ యూనిట్, బీడీఎల్ భానూర్ ఫైర్ వింగ్ సమన్వయంతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో అగ్నిమాపక భద్రత , విపత్తు నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. బీడీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ సి  శ్రీ రాం తేజస్వి, అసిస్టెంట్ కమాండెంట్ అర్షద్ అలీ ఖాన్ , వారి బృందం విద్యార్థులతో పా టు పాఠశాల ప్రిన్సిపాల్ సునీతకు , ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వివిధ విపత్తుల నుంచి తమను తాము, ఇతరులను ఎలా రక్షించుకోవాలో నేర్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సునీత ఈ కార్యక్రమా న్ని నిర్వహించిన సీఐఎస్ ఎఫ్, బీడీఎల్ బృందాలకు ధన్యవాదాలుతెలిపారు.