12 March, 2026 | 6:24 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ఇస్రో అంతరిక్ష కేంద్రం సందర్శనకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థి

19-01-2026 08:33 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నెల్లూరు జిల్లాలోని ఇస్రోలోని సతీష్ ధావన్ అంతరిక్షం కేంద్రం సందర్శించడానికి నాగిరెడ్డిపేట్ మండల్ గోపాల్పేట్ మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థి ర్యాకల లావణ్య ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్పేట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ...జిల్లా యంత్రాంగం సందర్శన కోసం ఎంపిక చేసిన 50 మంది విద్యార్థుల బృందంలో నాగిరెడ్డిపేట్ మండల్ గోపాల్పేట్ మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థి లావణ్య ఎంపికలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.విద్యార్థులకు ఇస్రో సంస్థను సందర్శించే అవకాశం కల్పించినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్,డీఈవో రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు పాఠశాల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున తెలియజేశారు.