25-06-2025 12:47:01 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, జూన్24(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో , పాల్గొని మధురానగర్ చౌరస్తాలో రైతులు, స్థానిక నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే మధుర నగర్ చౌరస్తాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతుభరోసా క్రింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది ప్రభుత్వానిదన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు చేయని తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి కోట్లు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంఅన్నారు.