15-06-2025 12:25:34 AM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీబీపేట మండల కేంద్రంలో పెద్ద చెరువులో గల ఒక కుంటలో చేపల వేటకు వెళ్లిన గుర్రం లక్ష్మణ్(40) రాత్రి 10 గంటల వరకు రాకపోయేసరికి రాత్రి నుండి కుటుంబ సభ్యులు వెతుక సాగారు. ఉదయం బీబీపేట చెరువులో గల ఒక కుంట దగ్గర చెప్పులు సైకిల్ ఉన్నదని సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడి కుంటలో వలవేసి చూడగా వలకు చిక్కిన లక్ష్మణ్ శవాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న బీబీపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరి పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. మృతుడికి భార్య మంజుల, కూతురు శిరీష కుమారుడు నిఖిల్ ఉన్నారు.