15-05-2025 01:34:08 AM
వరంగల్, మే 14 (విజయక్రాంతి): మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలే కాదు పశుపక్షాదులు తాగునీటికి అల్లాడు తున్నాయి. ఎండలు మండుతున్న నేపథ్యం లో గొంతు తడుపుకోవడానికి వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ కోతి పడుకున్న కష్టాలు విజయ క్రాంతి కెమెరాకు చిక్కాయి.
ప్రయా ణికుల కోసం ఏర్పాటుచేసిన తాగునీటి నల్లా నుంచి ప్రజలు తాగుతున్న వైనాన్ని చూసి తర్వాత ఓ కోతి అక్కడికి వచ్చి మనుషులు తిప్పినట్లుగానే నల్లా తిప్పి నీటితో గొంతు తడుపుకోగా, అదే తరహాలో వాటి వెనక మరికొన్ని కోతులు గొంతు తడుపుతున్నాయి.