17 April, 2026 | 10:18 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అధైర్య పడకండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది

15-05-2025 01:32 AM

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క

ములుగు, మే 14 (విజయక్రాంతి): అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.. అన్నదాతలు అధైర్యపడవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లి గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమములో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.