9 April, 2026 | 5:37 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

మొంథా తుఫాను.. అప్రమత్తంగా ఉండాలి

27-10-2025 08:07 PM

బి.వరప్రసాద్ తహశీల్దార్ శాలిగౌరారం..

నకిరేకల్ (విజయక్రాంతి): రాబోయే 2, 3 రోజులలో మొంథా తుఫాను ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున శాలిగౌరారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాలిగౌరారం తహశీల్దార్ బి.వరప్రసాద్ కోరారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాతావరణ శాఖ సూచన మేరకు రాబోయే రెండు రోజులు(28, 29) తుఫాను ప్రభావం ఉండటంతో తీవ్ర లోతట్టు ప్రాంతాలకు, కరెంట్ స్తంభాల వద్దకు, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలలో పొంచి ఉన్న విద్యుత్ వైర్లు, విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు రైతులు, ప్రజలు వెళ్లొద్దని ఆయన సూచించారు.