calender_icon.png 30 June, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా మూల కృష్ణారెడ్డి నియామకం

29-06-2025 07:17:45 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి ప్రాంతానికి చెందిన మూల కృష్ణ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ మేరకు మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana), పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ తో కలిసి మూల కృష్ణారెడ్డికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తానని, తన నియామకానికి సహకరించిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కృతజ్ఞతలు తెలియజేసినారు.