14-06-2025 05:03:52 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన 20 నెలల బాలుడి సంఘటనలో తక్షణమే పోలీసులు స్పందించి కాపాడి తల్లిదండ్రులకు అప్పగించినందుకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాలుడు తల్లిదండ్రులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar)ని కలిసి పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట నల్గొండ డిఎస్పీ కే శివరామిరెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు ఉన్నారు.