8 May, 2026 | 3:04 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

‘సెల్లార్‌లో చదువుల’పై కదలిక

09-08-2024 12:48 AM

నిర్మల్ ఆగస్టు 8 (విజయక్రాంతి): నిర్మల్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకులంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ‘సెల్లార్‌లో చదువులు’ అన్న శీర్షికతో ‘విజయక్రాంతి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఈ మేరకు బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు గురుకులానికి వచ్చి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తరగతి గదుల కొరత, మరుగు దొడ్ల సమస్యను విద్యార్థులు తెలియజేశారు. అదనపు గదులు లేకపోవడంతో సెల్లార్‌లో పాఠాలు వింటున్నామన్నారు. సమస్యల పరిష్కారంపై బీసీ గురుకులాల కార్యదర్శి సానుకూలంగా స్పందించారు.