calender_icon.png 11 December, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రులు గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌లను కలిసిన ఎంపీ అర్వింద్

11-12-2025 12:12:12 AM

పలు సమస్యలపై విన్నపాలు

జగిత్యాల అర్బన్, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి బుధవారం ఢిల్లీలోని పార్లమెం ట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను వేర్వేరుగా కలిసి నిజామాబాద్, జగిత్యాల నియోజకవర్గాలకు సంబం ధించి వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో పిట్ లైన్ ల ఏర్పాటు, పార్లమెంట్ పరిధి గుండా పలు రైళ్ల పొడగింపులు, వందే భారత్ సహా పలు నూతన రైళ్ల మంజూరు, అయ్యప్ప స్వాముల కొరకు కొల్లాంకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు.అదేవిధంగా కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి జగిత్యాల జిల్లాలో ఎన్ హెచ్ 61, 63 లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం,

అంబారీపేట, అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా కోరుతూ వినతి పత్రాన్ని అందజేయగా మంజూరుకు తక్షణమే మౌఖికంగా హామీ ఇచ్చి, సాంకేతిక మంజూరుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అనంతరం కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి దుర్గా దాస్ ఉయికే ను సైతం కలిసి జగిత్యాల జిల్లాలో బోర్నపల్లి నుండి జగన్నాథపూర్ వరకు హై లెవెల్ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా, గిరిజన మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రులకు ఎంపీ అర్వింద్ ధన్యవాదాలుతెలిపారు.