11-12-2025 01:41:17 AM
నిజామాబాద్, డిసెంబర్10 (విజయ క్రాంతి): నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో పిక్లైకలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో పిట్ లైన్ ల ఏర్పాటు, పార్లమెంట్ పరిధి గుండా పలు రైళ్ల పొడగింపులు, వందే భారత్ సహా పలు నూతన రైళ్ల మంజూరు,
అయ్యప్ప స్వాముల కొరకు కొల్లాంకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా కేంద్ర జాతీయ రహదారులు రవాణా శాఖ మంత్రి గడ్కరీ ని కలిసి జగిత్యాల జిల్లాలో ఎన్ హెచ్ 61,63 లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం, అంబారీపేట మరియు అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు అండర్ పాసుల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా కోరారు. మంజూరుకు తక్షణమే మౌఖికంగా హామీ ఇచ్చి, సాంకేతికంగా సాంకేతికంగా మంజూరుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అనంతరం కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి దుర్గా దాస్ ఉయికే ను సైతం కలిసిన ఎంపీ జగిత్యాల జిల్లాలో బోర్నపల్లి నుండి జగన్నాథపూర్ వరకు హై లెవెల్ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా, గిరిజన మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మంత్రి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.