31-05-2025 08:56:23 PM
రాజాపూర్: మండలంలోని చొక్కామ్ పేట గ్రామంలో శనివారం బొడ్రాయి పున ప్రతిష్ట కోట మైసమ్మ బోనాల వేడుకలు యువ నాయకుడు అభిమన్యు రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల ఆటలు, డప్పు చప్పుళ్లతో బోనాలను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,మేఘమాల రెడ్డి, గిరిధర్ రెడ్డి, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.