17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా క్యాండిల్ లైట్ డే

19-05-2025 12:00 AM

కామారెడ్డి, మే 18 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిజిహెచ్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల స్మారకార్థం సందర్భంగా ప్రతి ఏటా ఈనెల మూడవ ఆదివారం క్యాండిల్ లైట్ డే  నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఆసుపత్రి ఆవరణలో కొవ్వొత్తుల ను వెలిగించి ర్యాలీ నీ NHMPO  పద్మజా , ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డా.స్నేహ , డాక్టర్ ప్రీతి కమల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆస్పత్రి నుంచి ఇందిరా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు.

హెచ్‌ఐవి ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని వారు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో  ఏఆర్ టి, ఐ సి టి సి కౌన్సిలర్లు మేక నాగరాజు, గోపాల్, మెహరాజ్, ప్రవీణ్, లలిత కుమారి , వర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు రాణి, రమేష్, వై ఆర్ జీ కేర్ డిఆర్పి సుధాకర్, సేవా సంఘం పీ ఏం గోపాల్ , సిబ్బంది , ఐ ఎస్ ఆర్ డి ప్రతినిధి రాజేందర్,  వివిధ NGO ల   ఔట్రిచ్ వర్కర్లు పాల్గొన్నారు.