12 March, 2026 | 8:02 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

15-01-2026 12:36 AM

అలంపూర్, జనవరి 14: జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవిని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ధార్మిక సలహాదారుడు గోవిందా హరిని ఆహ్వానించినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులో వారిని కలిసి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేసినట్లు చెప్పారు. ఈనెల 19 నుంచి 24 వరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అదేవిధంగా వచ్చేనెల 14 నుంచి 18 వరకు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు.