నేడు మండలంలో ఎంపీ పర్యటన
15-07-2026 | 09:25am
ఎర్రుపాలెం జూలై 15(విజయక్రాంతి): ఖమ్మం ఎంపీ రాం సహాయం రఘురామిరెడ్డి(Ramasahayam Raghuram Reddy) బుధవారం నాడు మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని ఎంపీ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు.






