21 August, 2026 | 4:36 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

22-05-2026 01:13 PM

 తాండూరు ,మే 22,(విజయక్రాంతి):  వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా ఊర చెరువులో "జల సంచాయ్ - జన్ భాగిదారి'' కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను(Employment Guarantee Works) ఎంపీడీవో తిరుమల స్వామి, సర్పంచ్ ఆనంద్ నాయక్ తో  కలిసి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, గ్రామ కార్యదర్శి నవిత ,ఫీల్డ్అసిస్టెంట్ ఆంజనేయులు లకు సూచించారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిరక్షరాస్య కూలీలు ''ఉల్లాస్'' కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకోవాలని అన్నారు.