28 February, 2026 | 4:27 AM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

28-02-2026 02:34 AM

నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మండలం పోచారం, మాల్ తుమ్మెద, వదల్పర్తి గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామంలోని కూలీలం దరూ పనులకు హాజరయ్యేలా చూడాలని క్షేత్ర సహాయకులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతతో పాటు, కొలతల ప్రకారం పనులు పూర్తి చేస్తేనే గరిష్ఠ కూలీ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు భాస్కర్, అశోక్, అజ్ముద్దీన్, ఫీల్ అసిస్టెంట్లు స్వప్న, సాయిలు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.