16 April, 2026 | 7:18 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి

16-04-2026 04:32 PM

లక్ష్మణ చందా (విజయ క్రాంతి) : ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి రఘునాథ్ మ దర్శనం దేవేందర్ లు తెలిపారు . స్థానిక టీఎన్జీవో భవన్ లో, ఈ మధ్యకాలంలో డాక్టరేట్ పట్టాలు పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా బాధ్యులుగా బాధ్యతలు స్వీకరించిన నాయకులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వారిని ఘనంగా సత్కరించారు.

ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం లభించనప్పటికీ, ముదిరాజులు స్వశక్తితో పలు రంగాల్లో రాణిస్తున్నారని, అలాంటి వారిని మరింత ప్రోత్సహించి, వారి అభివృద్ధికి చేయుతనoదించడానికి ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ముందుండాలని వారు ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ గంగాధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొత్తపల్లి రఘునాథ్, పవన్ కుమార్, దర్శనం దేవేందర్ మరియు గోనెల శశిరాజ్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోలాపూర్ రాజేశ్వర్, మొగిలి రాములు, పందెన లక్ష్మణ్ ,శ్రీనివాస్, హనుమాoడ్లు, పురుషోత్తం, మోహన్, శ్రీధర్, రవి, వినోద్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు.