02-07-2025 01:21:31 AM
బెల్లంపల్లి అర్బన్, జూలై 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ మంగళవారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. నగర వాటిక కన్నాల పార్క్, నర్సరీని ఆయన తనిఖీ చేశా రు. వాటి నిర్వహణ తీరుపై సంబందిత అధికారులకు తగు చూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, ఇతర అధికారులు ఉన్నారు.