05-06-2025 07:33:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం అరులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) అభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీ నాయక్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరం గాను మొత్తం 25 సీట్లు అందుబాటులో ఉన్నాయని మూడవ తరగతిలో 13, ఐదవ తరగతిలో ఆరు, ఎనిమిదో తరగతిలో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈనెల తొమ్మిది నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న జిల్లా అధికారుల సమక్షంలో లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు 1,50,000 ఆదాయం పట్టణ విద్యార్థులకు రెండు లక్షల ఆదాయం ఉన్నవారు అర్హులని ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని సమకూరుస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని ఆయన కోరారు.