calender_icon.png 27 June, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

26-06-2025 08:35:40 PM

జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్(Junior Civil Judge Sai Kiran) అన్నారు. గురువారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ మాట్లాడుతూ..... విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకొని బాధ్యతతో నడుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా రాణించలన్నారు.

అనంతరం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని  అన్నారు. పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఒకసారి డ్రగ్స్, గంజాయి కి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మిరెడ్డి సత్తన్న, ఉపాధ్యక్షులు నలినీకాంత్, న్యాయవాదులు సురేందర్, రాజేశ్వరరావు, శ్రీధర్, పద్మ, శాతరాజు శివ, ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజ అదనపు ఎస్ఐ వై రామయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.