calender_icon.png 27 June, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత మండలంగా తీర్చిదిద్దాలి

26-06-2025 08:33:20 PM

పెన్ పహాడ్: డ్రగ్స్ రహిత మండలంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గోపికృష్ణ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ(Anti-Drug Day) దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు, గ్రామస్తులకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పాఠశాలల సమీప దుకాణాలపై నిఘా పెట్టాలని, డ్రగ్స్ రవాణా, విక్రయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు  ఉపేందర్, యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మండల కమ్యూనిటీ మొబిలైజర్ వగ్గు సోమన్న, ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న, ఏ ఎస్ఐ రాములు, పిడి కీత రవికుమార్, ఉపాధ్యాయులు ఆనంద భాస్కర్, పోలీస్ సిబ్బంది, రాములు, సిబ్బంది మహేష్, వంశీధర్ రెడ్డి , సైదులు, నరేష్ రెడ్డి శశికాంత్ రెడ్డి, మహేష్, అంగన్ వాడి కార్యకర్త వి. ఊర్మిళ, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.