28-05-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 27 (విజయక్రాంతి) : రైస్ మిల్లర్లు ఖరీఫ్ 2024 సంబంధించి సి.ఎం.ఆర్. డెలివరీ నిర్దేశిత లక్ష్యాలను త్వర గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాం బర్లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సి.ఎం.ఆర్. డెలివరీ, 2022- రబీ ధాన్యం వేలం అం శాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2024- ఖరీఫ్ సంబంధించిన సి.ఎం. ఆర్. (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్ ఎ.సి.కె. లక్ష్యాలను సైతం పూర్తి చేసి రబీకి సంబంధించి ధాన్యం ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు.
సకాలంలో డెలివరీ పూర్తి చేయని పక్షంలో ధాన్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపారు. మిల్లుల వారీగా పెం డింగ్లో ఉన్న లక్ష్యాల వివరాలను తెలిసుకొని అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పని చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్య క్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఆర్.ఐ. మురళీకృష్ణ, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.