15 March, 2026 | 9:17 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

నాగార్జునసాగర్.. మనకు ఆధునిక దేవాలయం: మంత్రి ఉత్తమ్

29-07-2025 12:24 PM

హైదరాబాద్: నాగార్జునసాగర్ నుంచి మంత్రులు నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్  క్రస్ట్ గేట్ల(Nagarjuna Sagar Dam Gates lifted) ఎత్తి నీరు విడుదల చేశారు. నాగార్జునసాగర్(Nagarjuna Sagar) జలాశయం 18 ఏళ్ల తర్వాత జులైలోనే నిండింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... సాగర్ నుంచి గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ .. మనకు ఆధునిక దేవాలయం అన్నారు. సాగర్కునెహ్రు పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని గుర్తుచేశారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టు ఇదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.